ప్రస్తుతం సమాజంలో ప్రతి చిన్న విషయానికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న యువత తమ తల్లిదండ్రుల గుండెల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.తల్లిదండ్రులు బెదిరించారని, టీచర్లు కొట్టారని, ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి మాట్లాడటం లేదని చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు, యువతలు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గాలిలో కలిసిపోతున్నా రు.వయస్సుకు సంబంధం లేకుండా ప్రేమలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.కాగా ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ప్రాణాలు విడిచిన సంఘటన చోటు చేసుకున్న సంగతి అందరిని కలకలం రేపుతోంది.
చిలకలగూడ ప్రాంతానికి చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి గా పని చేస్తున్నాడు.తనని ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.అల్వాల్ కు చెందిన ఓ యువతి.తను ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుంది.
ఫేస్ బుక్ లో చాటింగ్ ద్వారా వంశీ కృష్ణకు పరిచయమయ్యింది.పరిచయం కాస్త ప్రేమగా మారింది.తనపై ఉన్న ప్రేమను ఆమె బొమ్మను గుండెలపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు వంశీకృష్ణ.ఇలా సాగుతున్న తమ ప్రేమ జీవితంలో ఇరువురి మధ్య మనస్పర్థల ఎదురయ్యాయి.దీంతోఆ యువతి తనతో మాట్లాడటం మానేసింది.ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడ లేక పోయేసరికి మనస్తాపంతో కుంగిపోయిన వంశీకృష్ణ సోమవారం రోజున శవమై కనిపించాడు.ముందు రోజు తన స్నేహితులతో సంతోషంగా గడిపి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వంశీకృష్ణ సమీపంలో ఉన్న భూదేవి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది తెలుసుకున్న సికింద్రాబాద్ పోలీసులు వెంటనే ఉస్మానియాకు తరలించారు.
చేతికందిన కొడుకు చేజారిన సంగతి తెలిశాక తల్లిదండ్రుల గుండె తట్టుకోలేకపోయింది.