గడిచిన పది నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ విజృంభణ అదుపులో ఉంచుకోవడం కోసం ప్రజలు ఎప్పటికి అప్పుడు ఫేస్ మాస్క్ లను ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మరోవైపు ఫేస్ మాస్క్ దొంగలించిన ఒక కేసులో దుబాయ్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో భాగంగా నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష , 1.5 దిర్హామ్లను జరిమానా విధించింది.అంతేకాకుండా మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనంతరం నిందితులకు దేశం నుంచి బహిష్కరించినట్లు దుబాయ్ కోర్టు తీర్పు వెల్లడించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
జూన్ నెల 18 వ తారీఖున దుబాయ్ లో నివాసం ఉంటున్న ఆరుగురి పాకిస్థానీయులు నివాసం ఉంటున్న ఒక వేర్ హౌస్ లోకి నిందితులు అక్రమంగా ప్రవేశించి 1.5 లక్షల దిర్హామ్ల విలువ చేసే 156 బాక్స్ ల ఫేస్ మాస్క్ లను దొంగతనం చేశారు.ఇందులో భాగంగానే వేర్హౌస్ లో పని చేస్తున్న చైనా దేశానికి చెందిన ఒక ఉద్యోగి దొంగతనం జరిగిందని వెంటనే గ్రహించి అధికారులకు తెలియజేశాడు.
అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి కొన్ని రోజుల్లోనే అరెస్ట్ చేశారు.దర్యాప్తులో భాగంగానే తాము దొంగలించిన మాస్కులు అన్నిటిని కూడా బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి అమ్మినట్లు నిందితులు పోలీస్ అధికారులకు తెలిపారు.ఈ కేసులో భాగంగానే జూన్ నెల నుంచి దుబాయ్ కోర్టులో విచారణ జరుగుతుండగా తాజాగా నిందితులకు కోర్టు 3 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, జైలు శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరన చేస్తున్నట్లు తీర్పులో న్యాయస్థానం అధినేత వెల్లడించాడు.