యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని తెలిపారు.ఇలా ఫేస్ మాస్కులు ధరించడం వల్ల కరోనా మహమ్మారి ని కొంత వరకు కట్టడి చేయవచ్చు అని తెలిపారు.
అయితే ప్రస్తుతం ఫేస్ మాస్కులు ధరించవలసిన పనిలేదని స్వీడన్ ప్రభుత్వం తెలియజేసింది.కరోనా కేసులు పెరుగుతున్న, మరణాల సంఖ్య తక్కువగానే ఉండటం వల్ల ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం లేదని చెప్పింది. స్వీడన్ లో కేవలం 7000 కరోనా మరణాలు సంభవించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫేస్ మాస్కులు ఎప్పుడు ధరించాలనే సూచనలు తెలిపింది.దుకాణాలు, పాఠశాలలు, కార్యాలయాలు తగినంత వెంటిలేషన్ లేని ప్రదేశాలలో మాత్రమే మాస్కులు ధరించాలని తెలిపింది.
వీలైనంత వరకు వారు నివసించే ప్రదేశాలలో వెంటిలేషన్ ఉండేలా, బయట గాలి లోపలికి వచ్చేలా తగినన్ని చర్యలు తీసుకోవాలని W.H.O సూచనలు చేశారు.
వ్యాధి ప్రభావం, వ్యాధి లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఫేస్ మాస్కులు ధరించాలని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఐసోలేషన్ లో ఉండాల్సిన పనిలేదని స్వీడన్ చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రెస్ అన్నారు.స్వీడన్ లో వ్యాధి తీవ్రత ఎక్కువగా లేనందున మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని W.H.O తెలిపింది.కరోనా విషయంలో ఇప్పటికే చేసిన పలు అధ్యయనాలలో మాస్కులు ధరించడం కన్నా, భౌతిక దూరం పాటించడం ఎంతో మంచిదని తేలాయి.
సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.
స్వీడన్ లో కరోనా కేసులు, మరణాలు తక్కువగా ఉండటం వల్ల ఫేస్ మాస్కులు అవసరం లేదని తెలిపారు.కానీ, మిగతా దేశాల్లో కరోనా వ్యాధి వ్యాప్తి తోపాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం వల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు తగిన జాగ్రత్తలను పాటిస్తూ, నిత్య కార్యకలాపాలను కొనసాగించాలని అధికారులు తెలిపారు.