స్టార్ దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.వరుసగా ఐదు ఇండస్ట్రీ హిట్స్ తో అనిల్ మంచి జోరు మీద ఉన్నాడు.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా ఎనౌన్స్ చేద్దామని అనుకునేలోపే కరోనా లాక్ డౌన్ వచ్చిపడింది.దీంతో ఈ ఆరు నెలలు ఇంటిపట్టునే ఉన్న అనిల్ ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్ సన్నాహాల్లో ఉన్నాడు.
ఎఫ్ 2 సూపర్ హిట్ తర్వాత ఎఫ్ 3 కూడా ఉండబోతుంది అని అనిల్ చెప్పాడు.దానిలో ముగ్గురు హీరోలు ఉంటారని క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక తాజాగా ఎఫ్ 3 సినిమా గురించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు.వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ హీరో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
అతను ఎవరనేది ఇంకా అనిల్ క్లారిటీ ఇవ్వలేదు.దీనికోసం రవితేజని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడి తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఎఫ్3 మూవీకి సంబందించిన విశేషాలు పంచుకున్నారు.యాక్షన్, కమర్షియల్ జోనర్ లో వెళ్తున్న తన ఆలోచనలని పూర్తిగా ఎఫ్ 2 సినిమా మార్చేసిందని చెప్పాడు.
దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాలు కంటే ఎక్కువ కలెక్షన్స్ ఎఫ్ 2 తీసుకొచ్చింది.ప్రస్తుతం ఎఫ్3 పనిలో ఉన్నాను.ఎఫ్ 3లో మరింత ఫన్ ఉంటుంది.డిసెంబర్ 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం.
ప్రస్తుతం అందరూ కరోనాకు మందు కనుక్కొనే పనిలో ఉన్నారు.ఈలోపల మేము ఎఫ్ 3తో నవ్వుల వ్యాక్సిన్ను సిద్ధం చేస్తాం అని చెప్పుకొచ్చాడు.