వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా రాజేంద్ర ప్రసాద్ మరియు సునీల్ లు కీలక పాత్ర ల్లో నటించిన ఎఫ్ 3 సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
అనీల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు భారీ అంచనాల నడుమ నిర్మిస్తున్న ఈ సూపర్ హిట్ సీక్వెల్ షూటింగ్ పూర్తి అవ్వడం తో విడుదల విషయమై సస్పెన్స్ మొదలు అయ్యింది. షూటింగ్ జర్నీ పూర్తి అయ్యింది.
మీ యొక్క నవ్వుల జర్నీ కూడా త్వరలో ప్రారంభం అవ్వబోతుంది అంటూ విడుదల తేదీ విషయం లో క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికే సినిమా ను ఏప్రిల్ 28 అంటూ ప్రకటించారు.
అదే సమయంలో సినిమా ను కాస్త ముందు కాని కాస్త ఆలస్యంగా అయినా విడుదల చేయడం పక్కా అంటూ ప్రకటించారు.
కాస్త అటు ఇటుగా ఏప్రిల్ లేదా మే నెల లో సినిమా ను విడుదల చేయబోతున్నారు.
ఎఫ్ 2 సినిమా వంద కోట్ల వసూళ్లు దక్కించుకుంది.కనుక ఈ సినిమా పై ఏమాత్రం అశ్రద్ద చూపించకుండా వంద కోట్లకు మించిన వసూళ్లు దక్కించుకునేలా మేకర్స్ ఈ సినిమా ను షూటింగ్ చేశారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా ను గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు.
గత ఏడాది ఆగస్టు లోనే సినిమా ను విడుదల చేస్తామన్నారు.కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా వేశారు.ఇప్పటి వరకు అపజయం లేని అనీల్ రావి పూడి ఈ సినిమా కు దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి అంచనాల కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.