ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఎఫ్ 3 సినిమా ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం అయ్యింది.రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలు పెట్టినట్లుగా స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక పెద్ద ఇంటి సెట్టింగ్ లో జరుగుతుందట.ఆ ఇల్లు అల్లు అర్జున్ హీరోగా నటించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురంలో సినిమా కోసం వేసిన సెట్టింగ్ గా చెబుతున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ ను వైకుఠపురం సెట్ లో చేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కొన్ని సెట్ లను వెంటనే తొలగించకుండా ఉంచేస్తూ ఉంటారు.
వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి వేయడం వల్ల వాటిని అద్దెకు ఇవ్వడం కోసం ఉంచేస్తూ ఉంటారు.అదే ఇప్పుడు వైకుంఠపురం సెట్ విషయంలో జరుగుతుంది.
దర్శకుడు అనీల్ రావిపూడి సినిమా బడ్జెట్ విషయంలో చాలా చాలా పొదుపుగా వ్యవహరిస్తూ పిసినారి అనిపించుకుంటాడు.అవసరం అయితేనే ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు.అలాంటి అనీల్ రావిపూడి ఈ సినిమా ను కూడా తక్కువ బడ్జెట్ లో చేయాలనే ఉద్దేశ్యంతో ఆ సెట్ ను ఉపయోగించుకుంటున్నాడు.వరుసగా చేస్తున్న సినిమాలతో దూకుడు మీదున్న అనీల్ రావిపూడి ఈ సినిమాను సమ్మర్ చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం వెంకటేష్ పై చిత్రీకరణ జరుపుతున్నాడు.త్వరలోనే వరుణ్ తేజ్ కూడా జాయిన్ అవుతాడు అంటున్నారు.
గత సినిమాల్లో భార్య ప్రియురాలు పెట్టే కష్టాలు ఇబ్బందులతో ఫన్ ఫ్రస్టేషన్ ను చూపించిన హీరోలు ఈ సారి డబ్బు కోసం అల్లాడి పోతూ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో పాటు మరో ఎఫ్ ను కూడా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే హింట్ ఇచ్చారు.సినిమాలో మెహ్రీన్ మరియు తమన్నాలు హీరోయిన్ లు గా నటిస్తున్నారు.
దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా వచ్చే దసరా వరకు వస్తే బాగుండు అన్నట్లుగా ప్రేక్షకులు ఉన్నారు.అల వైకుంఠపురం సెట్ వాడుతున్న కారణంగా సెంటిమెంట్ కలిసి వస్తుందేమో చూడాలి.