దిల్ రాజు ప్రొడక్షన్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎఫ్2.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసి దిల్ రాజుకి భారీ లాభాలు తీసుకొచ్చింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్3 మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.
దిల్ రాజు ఏకంగా 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్3 ఫస్ట్ షెడ్యూల్ తర్వాత వారి ఇతర ప్రాజెక్ట్ లలో బిజీ అయిపోయారు.వెంకటేష్ దృశ్యం 2ని దొరికిన గ్యాప్ లో పూర్తి చేసేశాడు.
ఇక వరుణ్ తేజ్ కూడా గని సినిమాని మేగ్జిమమ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో కొత్త షెడ్యూల్ ని అనిల్ రావిపూడి ప్రారంభించదానికి రెడీ అయ్యాడు.ఏప్రిల్15 నుంచి మైసూరులో ఏకదాటిగా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది.
ఇక ఈ షెడ్యూల్ లో క్యాస్టింగ్ అంతా పాల్గొంటారని అలాగే అంజలి కూడా జాయిన్ అవుతుందని తెలుస్తుంది.
ఆమె ఈ సినిమాలో ఈ కీలక పాత్రలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే ఈ షెడ్యూల్ లో సినిమాని మేగ్జిమమ్ కంప్లీట్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసి తరువాత సాంగ్స్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు బోగట్టా.సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కావడంతో క్యాస్టింగ్ అంతా మైసూరు బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది.