టాలీవుడ్ లో చాలా వరకు సినిమాలు కాంబినేషన్స్ మీద నడుస్తూ ఉంటాయి.ఒకసారి ఒక కాంబినేషన్ లో సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే ఆ కాంబినేషన్ ని మళ్ళీ నిర్మాతలు రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అయితే కాంబినేషన్ లో నెక్స్ట్ సినిమా అనేసరికి ప్రేక్షకుల అంచనాలు మారిపోతాయి.అలాగే బడ్జెట్ పరిధులు కూడా మారిపోతాయి.
ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్ గా తెరకెక్కబోయే ఎఫ్3 సినిమాకి కూడా అదే పరిస్థితిని దిల్ రాజు ఎదుర్కొంటున్నాడు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్2 సినిమాని 30 కోట్ల బడ్జెట్ లో దిల్ రాజు పూర్తి చేశాడు.
ఈ సినిమాకి ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్ వచ్చింది.ఇప్పుడు అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
అది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే.వచ్చే నెల 14న సినిమా ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు.ఎఫ్2 తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మరో సక్సెస్ కొట్టి అనిల్ రెమ్యునరేషన్ స్థాయి పెంచుకున్నాడు.ఇక వరుణ్ తేజ్ కూడా గద్దలకొండ గణేష్ తో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.వెంకటేష్ కూడా వెంకీమామ సినిమాతో సక్సెస్ కొట్టాడు.ఈ నేపధ్యంలో వీళ్ళ రెమ్యునరేషన్స్ కూడా పెరిగిపోయాయి.దీంతో పాటు మరో హీరో కూడా ఉన్నాడు కాబట్టి హీరోలు, దర్శకుడు రెమ్యునరేషన్ రూపంలోనే బడ్జెట్ ఎఫ్2ని దాటిపోతుంది.
ఇక మిగిలిన నటీనటులు, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం అదనంగా మరో ముప్పై కోట్లు పెట్టుకోవాల్సిందే.దీంతో కాంబినేషన్స్, సీక్వెల్ వలన దిల్ రాజు ఇప్పుడు ఎఫ్ 3 కోసం ఏకంగా అరవై కోట్లు పైగానే ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి వచ్చిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.