అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా F3.ఇది F2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.F2 సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.అందుకే అనిల్ ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.
అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన ‘సరిలేరు నీకెవ్వరూ‘ సినిమాతో గత సంవత్సరం సంక్రాంతికి థియేటర్స్ కు వచ్చాడు.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్లు కుమ్మేసింది.అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నాడు.కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
దీంతో ఈ సినిమాను వాయిదా వేయక తప్పలేదు.ఎఫ్ 3 సినిమాను ఆగస్టు 27 వ విడుదల చేయాలనీ భవించినా ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు ఇప్పుడు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలనీ అనుకుంటున్నాడట.
ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆడియెన్స్ థియేటర్స్ కు అప్పుడే వచ్చేందుకు సిద్ధంగా ఉండరనే అందులోను ఇప్పుడు వాయిదా పడ్డ సినిమాలన్నీ విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.అందుకే దిల్ రాజు ఆగష్టు లో సినిమా విడుదల చేయకూడదని అనుకుంటున్నాడట.
అంతేకాదు అనిల్ కు కలిసొచ్చే సంక్రాంతి సీజన్ లోనే విడుదల చేస్తే ఎఫ్ 3 కూడా సూపర్ హిట్ అవుతుందని దిల్ రాజు ఆలోచిస్తున్నాడట.
అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా మరింత ఫన్ తో తెరకెక్కించబోతున్నట్టు పోస్టర్ చూస్తూనే అర్ధం అవుతుంది.
ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమాలో మరొక ప్రధాన పాత్రలో సునీల్ నటిస్తున్నాడు.