హుజురాబాద్ ఉపఎన్నిక పుణ్యమా అని నియోజకవర్గ ప్రజలపై వెనువెంటనే వరాల జల్లులు కురుస్తున్నాయి.పొలిటికల్ పార్టీలు అన్ని అక్కడే తిష్ట వేసి ఓటర్లకు ఏమి కావాలో అడిగి మరీ తెలుసుకుంటున్నారు.
ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా సరే వెనుకాడటం లేదని తెలుస్తోంది.ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా డబ్బును చూస్తున్నారడంలో అతిశయోక్తి లేదు.
అంతేకాకుండా కాస్ట్లీ ఎన్నికగా హుజురాబాద్ నియోజకవర్గం రాష్ట్ర చరిత్రలో మిగిలిపోనుంది.
ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఓటర్లను మచ్చిక చేసుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి.
టీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు ప్రజలకు చేరువ అయ్యేందుకు కొత్త కొత్త పథకాలు రచిస్తున్నారు.అందుకోసమే గుట్టుచప్పుడు కాకుండా బహుమతులు, డబ్బు పంచుతున్నారు.
తాజాగా నియోజకవర్గంలో కళ్లు చెదిరే దావత్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.అందుకోసం దసరా పండుగ రోజున ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం.
చిన్న వ్యాపారుల మొదలుకొని ఓటు బ్యాంకు ఉన్నవారే టార్గెట్గా పావులు కదుపుతున్నారు.ఫెస్టివల్ బొనాంజా పేరుతో కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉంటే వారందరికీ నగదు, బహుమతులు, విందు, వినోదాల పేరిట ప్రబోభాలకు గురిచేసేందుకు పొలిటికల్ పార్టీలు సన్నద్ధమయ్యాయి.
ఈనెల 15న విజయదశమి రోజున నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు ఓటర్ల జేబులు నింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.కాగా, రాజకీయ పార్టీల కష్టం ఏ మేరకు ఫలిస్తుందో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సిందే.