తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఇంటర్ బోర్డు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులు, యూత్ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వాగ్వివాదం తోపులాటకు దారితీసింది.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అనంతరం రేపటి నుంచి శ్రీ చైతన్య విద్యాసంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని యూత్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు