ఈటీవీ లో ప్రసారమయ్యే” జబర్దస్త్” కామెడీ షో ద్వారా అద్భుతమైన స్కిట్ లను చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించేస్తుంటారు.ఇందులో పాల్గొనే టీమ్ లీడర్లు సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకులను ఆనందింప చేస్తుంటారు.
ఈ షో ద్వారా కేవలం మనుషులను నవ్వించడమే కాకుండా, కొన్నిసార్లు మనుషుల మనసును, హృదయానికి హత్తుకునే భావోద్వేగమైన స్కిట్ లను చేస్తూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్కిట్ రూపంలో తెలియజేస్తూ, అందరి చేత కంటతడి పెట్టిస్తున్నారు.
ఇందులో భాగంగానే డిసెంబర్ 4వ తేదీన ప్రసారం కాబోయే “ఎక్స్ ట్రా జబర్దస్త్”ప్రోమో విడుదల అయినది.
ఇందులో రాకింగ్ రాకేష్ విభిన్నమైన కాన్సెప్ట్ ద్వారా నటించి అందరి చేత కంటతడి పెట్టించారు.ఈసారి పంటలు బాగా పండి, కోతకు వచ్చిన సమయంలో అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది.
దీని ఆధారంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ స్కిట్ నిర్వహించాడు.
స్క్రిప్ట్ లో భాగంగా చేతికొచ్చిన పంట అకాల వర్షం కారణంగా నాశనం అయిపోతే ఆ రైతు పడే మనోవేదనను, బాధలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించి రైతుల కష్టాలను ఎంతో అద్భుతంగా తెలియజేశాడు.ఈ స్కిట్ ను చూసిన జడ్జిలు, ఇతర టీమ్ మెంబర్లకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.డిసెంబర్ 4న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఈ సన్నివేశాన్ని మనము చూడవచ్చు.
అంతేకాకుండా చాలా రోజుల తర్వాత రష్మి, సుదీర్ కలిసి మగధీర సినిమా కి స్పూఫ్గా ఒక స్కిట్ ను చేయనున్నారు.ఇందులో సుధీర్ “ఖాళీ బీరువా”, రష్మీ “ఇత్తడి బిందెగా” కనిపించబోతున్నారు.
అంతే కాకుండా ఇతర టీ మెంబర్లు తన అద్భుతమైన స్కిట్ లతో వచ్చేవారం ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేయనున్నారు.