బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్…!!

దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ ఐదు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి షాక్ ఇస్తున్నాయి.

 Exit Polls Hurt Bjp Tamilnadu, Bjp, Mamatha Banerjee, Dmk, Bengal , Exit Poolls-TeluguStop.com

మేటర్ లోకి వెళితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ బయటపడ్డాయి.తమిళనాడు రాష్ట్రంలో బలం లేకపోయినా కానీ అక్కడ అధికార పార్టీ అన్నాడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ కీలకంగా రాణించడం జరిగింది.

కానీ ఎగ్జిట్ పోల్స్ లో తమిళ ప్రజలు ఈసారి డీఎంకే పార్టీకి మొగ్గుచూపినట్లు ఫలితాలు బయటపడ్డాయి.ఇక పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అయితే బీజేపీకి మరియు అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మన్నటుగానే పరిస్థితి ముందు నుండి ఉంది.

ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం కూడా హోరాహోరీగా సాగింది.ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 100 స్థానాలు రాబడుతుందని మరోసారి మమతా బెనర్జీ అధికార పీఠం కైవసం చేసుకోవటం గ్యారెంటీ అని ఫలితాలు వచ్చాయి.

దీంతో దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి ఎదురుగాలి వేస్తున్నట్లు తాజా పరిస్థితుల బట్టి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube