నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే.సినిమా రిలీజ్ అయిన మూడు రోజులు అవుతున్నా కూడా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది.
అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.రెండు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టేసింది.
ఆన్ లైన్ లో సైతం టికెట్లు దొరకడం లేదు.థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
అభిమానులు బాలయ్య సినిమా చూస్తూ థియేటర్లలో ఈలలు,కేకలతో సందడి సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఫ్యాన్స్ కమ్ ఎగ్జిక్యూటివ్ హఠాన్మరణం చెందాడు.
అఖండ సినిమా చూస్తూ అతను మరణించడం అందరిలో ఒక్కసారిగా విషాదాన్ని నింపింది.తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ అయిన జాస్తీ రామకృష్ణ శ్యామల థియేటర్ లో అఖండ సినిమా చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యి ప్రాణాలు విడిచారు.
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.
ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించాడు.రాజమండ్రి సమీపంలో ఉన్న నామవరం వి ఎస్ మహల్ థియేటర్ ఓనర్ గా కెరీర్ ను ప్రారంభించి, ఆ తరువాత సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, అలాగే వింటేజ్ క్రియేషన్స్ అధినేతగా రామకృష్ణ ఎదిగారు.ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమా 50 కోట్లకు పైగా అమ్ముడు పోగా రెండు రోజుల్లోనే సగం అమౌంట్ ను రాబట్టింది.
ఇక వీకెండ్ ముగిసే సరికి బాలయ్య ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి మరి.ఇక అమెరికాలో అయితే ఏకంగా హాఫ్ మిలియన్ మార్క్ ను కూడా క్రాస్ చేశాడు బాలయ్య బాబు.