మనదేశంలో ఉన్న స్వేచ్చ కోసం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.ఒక రకంగా మితిమీరిన స్వేచ్చ ఉంది భారత దేశంలో.
అందుకే కావచ్చూ ఇక్కడ నేరాలు కూడా ఎక్కువే జరుగుతుంటాయి.కానీ నేరాలు ఎన్ని జరిగిన నేరం చేసిన వారు శిక్ష అనుభవించడం కొంత వరకు మన దగ్గర తక్కువే అని చెప్పవచ్చూ.
అందులో కఠినమైన నేరం చేసిన వారికి ఉరిశిక్ష అమలు చేయడం కూడా అరుదుగా జరుగుతుంది.
ఈ క్రమంలో ఇప్పటి వరకు మగవారికే ఉరి శిక్ష అమలుచేసింది మనదేశం.
కానీ మొట్ట మొదటి సారిగా ఒక మహిళ ఖైదీకి ఉరి అమలు చేయడానికి సిద్దం అవుతున్నారట.మన దేశంలో చోటు చేసుకుంటున్న ఆ సంచలనం గురించి తెలుసుకుంటే.
ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహకు చెందిన షబ్నమ్ ఇంగ్లీష్ లో ఎంఏ చేసారు.కాని ఆమె కనీసం 5 వ తరగతి కూడా చదవని సలీం ప్రేమలో పడ్డారు.ఆ ప్రేమను ఒప్పుకోని తన కుటుంబాన్ని అతి కిరాతకంగా అంతం చేసింది.సరిగా 13 ఏళ్ళ క్రితం అంటే 2008 లో జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది.
అప్పటి నుండి కొనసాగుతున్న ఈ కేసులో ఇద్దరినీ దోషులుగా గుర్తించిన కోర్ట్ ఉరితీయాలని ఆదేశాలు ఇచ్చింది.కాగా ఉరి తేదీ ఖరారు కాగానే ఆమెను ఉరి తీయడానికి మథురైలోని జైలులో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
అయితే ఆ ఉరి తేదిని ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు.