మన దేశంలో సంచలనం.. ఉరికంబం ఎక్కబోతున్న మహిళ.. !!

మనదేశంలో ఉన్న స్వేచ్చ కోసం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.ఒక రకంగా మితిమీరిన స్వేచ్చ ఉంది భారత దేశంలో.

 Execution Of A Woman For He First Time In Our Country Uttar Pradesh, Execution,-TeluguStop.com

అందుకే కావచ్చూ ఇక్కడ నేరాలు కూడా ఎక్కువే జరుగుతుంటాయి.కానీ నేరాలు ఎన్ని జరిగిన నేరం చేసిన వారు శిక్ష అనుభవించడం కొంత వరకు మన దగ్గర తక్కువే అని చెప్పవచ్చూ.

అందులో కఠినమైన నేరం చేసిన వారికి ఉరిశిక్ష అమలు చేయడం కూడా అరుదుగా జరుగుతుంది.

ఈ క్రమంలో ఇప్పటి వరకు మగవారికే ఉరి శిక్ష అమలుచేసింది మనదేశం.

కానీ మొట్ట మొదటి సారిగా ఒక మహిళ ఖైదీకి ఉరి అమలు చేయడానికి సిద్దం అవుతున్నారట.మన దేశంలో చోటు చేసుకుంటున్న ఆ సంచలనం గురించి తెలుసుకుంటే.

Telugu India, Uttar Pradesh-Latest News - Telugu

ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహకు చెందిన షబ్నమ్ ఇంగ్లీష్ లో ఎంఏ చేసారు.కాని ఆమె కనీసం 5 వ తరగతి కూడా చదవని సలీం ప్రేమలో పడ్డారు.ఆ ప్రేమను ఒప్పుకోని తన కుటుంబాన్ని అతి కిరాతకంగా అంతం చేసింది.సరిగా 13 ఏళ్ళ క్రితం అంటే 2008 లో జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది.

అప్పటి నుండి కొనసాగుతున్న ఈ కేసులో ఇద్దరినీ దోషులుగా గుర్తించిన కోర్ట్ ఉరితీయాలని ఆదేశాలు ఇచ్చింది.కాగా ఉరి తేదీ ఖరారు కాగానే ఆమెను ఉరి తీయడానికి మథురైలోని జైలులో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

అయితే ఆ ఉరి తేదిని ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube