ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్ల గోల తగ్గిందని ప్రజలు ఊపిరి తీసుకుంటున్న సమయంలో మరోసారి ఈ ఘటన తెరపైకి వచ్చింది.కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ చొరీ తాలూకూ వివరాలు తెలుసుకుంటే.
కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనిలో నివాసం ఉండే వరలక్ష్మి (60) అనే వృద్ధురాలు ఇమృటి పనులు చేసుకుని ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పూజకు కావాల్సిన పువ్వుల కోసం బయటకు వచ్చిన క్షణంలో, ఆ వృద్దురాలి దగ్గరికి బైకుపై వచ్చిన ముగ్గురిలో ఒకడు అడ్రస్ ఆడిగినట్టు అడిగి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారాన్ని అపహరించి ఉడాయించారట.
ఊహించని సంఘటనకు బిత్తరపోయిన ఆ వృద్ధురాలు తేరుకుని అరిచేలోపు ఆ దుండగులు అక్కడి నుండీ ఉడాయించారట.
ఇక ఆమె అరపులకు బయటకు వచ్చిన ఇరుగు పొరుగు వాళ్లూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టణ ఎస్.హెచ్.ఓ మధుసూదన్ ఆధ్వర్యంలో కాలనికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు.ఇకపోతే గత కొంతకాలంగా చైన్ స్నాచర్ల ఆగడాలు తగ్గాయి.
ఇలా మళ్ళీ మొదలవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైందట.