ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇవాళ ఢిల్లీ చేరుకోనున్న ఆయన.
సోనియాగాంధీతో భేటీ కానున్నారు.ఈ సమావేశంలో రాజస్థాన్ లో తాజా పరిణామాలతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆయన వివరణ ఇవ్వనున్నారని సమాచారం.
ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం సమస్య కొలిక్కి వచ్చినా.గెహ్లాట్ బరిలో ఉంటారా లేదా అన్నది ఈ సమావేశం తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే, ఈనెల 30తో నామినేషన్ దాఖలకు గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.మరోవైపు ఎంపీ శశి థరూర్తో పాటు ఆ పార్టీ సీనియర్ నేత పవన్ కుమార్ బన్సాల్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ ధాఖలు చేసినట్లు తెలుస్తోంది.