ప్రస్తుత సమాజంలో ఉన్న యువతీ యువకులు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో అనర్ధాలు సంఘటనలు జరుగుతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం.కొందరు యువతీ యువకులు ప్రేమలో పడి వారి ఇంటి సభ్యులను ఎదిరించి మరీ, ప్రేమ వివాహాలు చేసుకుంటే మరికొందరు వారిని ఎదిరించలేక మధ్యలోనే జీవితాన్ని చాలిస్తున్నారు.
దీంతో వారి కుటుంబ సభ్యులకు ఎనలేని కడుపుకోతను మిగులుస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత పెళ్లి జరిగింది.ఇద్దరు మైనర్లు ఏకంగా వారి క్లాస్ రూమ్ లోనే వారి స్నేహితుల ముందర పెళ్లి చేసుకున్నారు.ఎంతో పవిత్రమైన పెళ్ళిని కాస్తా ఆ యువజంట బొమ్మలాటగా చేశారు.మైనర్లు ఆయన వారిద్దరూ ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వ కాలేజీలో ఈ సంఘటన జరిగింది.ప్రభుత్వ కాలేజీలో తరగతి గదిలో ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకోవడం.
అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు కాస్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు కళాశాల ప్రిన్సిపల్ ఆ ఇద్దరు విద్యార్థులకు టీసి ఇచ్చి కాలేజీ నుంచి పంపించేశారు.దీంతో ఆ ఇద్దరు మైనర్లు చేసిన పనికి వారి తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.నేటి యువత ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారు ఇబ్బందులలో పడటమే కాకుండా, వారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కాబట్టి ఏదైనా విషయాన్నీ తొందరపడకుండా కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటే ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండవచ్చు.