సరిగ్గా ఎన్నికల ముందు బాలకృష్ణ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా జరిగింది ముగిసిన సంగతి తెలిసిందే.పంచాయతీ ఎన్నికలలో దాదాపు 100% స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలిచినట్లు ఏపీ మీడియాలో అదేరీతిలో రాజకీయ వర్గాల్లో టాక్.

 Exactly Before The Lection A Setback For The Tdp In Balakrishna Constituency Hin-TeluguStop.com

దీంతో టీడీపీ పని అయిపోయింది అందుకే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచింది అనే వాదన ప్రస్తుతం బలంగా వినబడుతుంది.

ఇదిలా ఉంటే మరి కొద్ది రోజులలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో టిడిపి పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో రంగనాయకులు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.పార్టీ పెట్టిన నాటి నుండి ఎంతో నమ్మకంగా ఉన్న రంగనాయకులు 2004వ సంవత్సరంలో హిందూపురం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.

పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్న రంగనాయకులు ఒక్కసారిగా సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు వైసీపీలో జాయిన్ అవ్వడం తో తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా ఇది ఎదురుదెబ్బ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube