ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన టువంటి హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుకోకుండా తన మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు మాత్రం సోషల్ మీడియా మాధ్యమాలలో ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన విషయాలపై ఓ ప్రముఖ అధికారి స్పందించారు.ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను నెటిజన్లకు తెలిపారు.
అయితే ఇంతకీ ఆ ప్రముఖ అధికారి ఎవరంటే భారతదేశ రా సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఎస్.కే సూద్.తాజాగా ఎస్.కే సూద్ తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన విషయాలను వీడియో ద్వారా తన అభిమానులకు తెలిపాడు.అయితే ఇందులో సుశాంత్ మరణం వెనుక ఓ ప్రముఖ మాఫియా డాన్ హస్తం ఉందని, అంతేగాక ఈ మాఫియా డాన్ అనుచరులు కొంతమంది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని మానసికంగా విధించడంతో పాటు, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని అందువల్లే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫోన్ సిమ్ కార్డులను కూడా మార్చేశాడని ఆరోపించారు.అయితే ఈ మాఫియా డాన్ గ్యాంగ్ మాటలను లెక్క చేయనటువంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని తన సొంత నివాసంలో దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీంతో ఈ విషయంపై స్పందిస్తున్న కొంత మంది నెటిజన్లు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి మాఫియా డాన్ తో ఎలాంటి సంబంధాలు లేవని అంటున్నారు.అయితే మరికొంతమంది మాత్రం గత కొద్దికాలంగా ఓ మాఫియా డాన్ బాలీవుడ్ సినీ పరిశ్రమలో చక్రం తిప్పుతున్నాడని అంతేగాక ఈ మాఫియా డాన్ తో బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి కొందరి నిర్మాతలకి సత్సంబంధాలను కూడా కలిగి ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు.
మరి వీటిపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.