పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత విదేశాంగ విధానంపై ప్రశంసల జల్లు కురిపించారు.లాహోర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత విదేశాంగ విధానాన్ని ఆయన ప్రస్తావించారు.స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడిన వీడియో క్లిప్ను కూడా ఆయన ప్లే చేశారు.
రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడంపై అమెరికా ఒత్తిడిని ధీటుగా ఎదుర్కొన్నారంటూ కొనియాడారు.స్వతంత్ర దేశమంటే ఇండియానే అంటూ పొగిడారు.