రాజకీయాలలో ప్రత్యర్ధి పార్టీలు ఒకరి మీద ఒకరు ఎలాంటి విమర్శలైన చేసుకోవడానికి వెనుకాడరు.అలాగే ఎలాంటి కుట్రలకైన సిద్ధం అయిపోతారు.
ప్రత్యర్ధి పార్టీలని నాశనం చేయడం లేదంటే, ప్రత్యర్ధి రాజకీయ నేతలని ఓడించడమే లక్ష్యంగా నీచమైన పనులకి కూడా సిద్ధమై వారిపై ప్రజలలో ఉన్న గౌరవం కోల్పోయేలా చేయడం ద్వారా లాభపడాలని ప్రయత్నం చేస్తారు.దీనికి మీడియా కూడా ఊతం ఇస్తూ ఉంటుంది.
ఈ మధ్యకాలంలో తెలుగు మీడియా అయితే మర దారుణంగా బరితెగించింది అని చెప్పాలి.
కొన్ని చానల్స్ అయితే శృతి మించి జర్నలిజం విలువలని పూర్తిగా వదిలేసి కొందరు వ్యక్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేయించి, అలాగే వారి వ్యక్తిత్వాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
మీడియా ముసుగు వేసుకొని చేస్తున్న ఈ అరాచకానని జనం ఛీ కొడుతున్న అదే పంథాలో ఆ మీడియా సంస్థలు వెళ్తున్నాయి.మరోసారి ఓ మీడియా చానల్ ఎన్టీఆర్ సతీమణి, లక్ష్మి పార్వతి మీద సంచలన కథనం ప్రశాం చేసింది.
లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ కోటి అనే వ్యక్తి వినుకొండలో పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు కథనం ప్రసారం చేస్తోంది.ఈ కోటి అనే వ్యక్తి దాదాపు నాలుగేళ్లుగా లక్ష్మీపార్వతి వద్ద అసిస్టెంట్గా పని చేశాడు.ఎన్టీఆర్ పై అభిమానంతో తాను ఆమె దగ్గర అసిస్టెంట్గా పని చేశానని, కానీ ఏడాది కాలంగా ఆమె తనను లైంగికంగా వేధిస్తోందంటూ కోటి కొన్ని ఆధారాలు బయటపెట్టినట్టు లైవ్ షోలో తెలిపాడు.ఐతే ఈ కోటి అనే వ్యక్తి ఇప్పుడే సడెన్ గా ఎందుకు బయటకి వచ్చాడు అనే ప్రశ్న తలెత్తుతుంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ తో తనని దెబ్బ తీసే ప్రయత్నం జరిగిందని చంద్రబాబు భావిస్తున్నారు.దీంతో తెలుగు దేశం ప్రోద్బలంతోనే లక్ష్మి పార్వతి మీద ఆ వ్యక్తి లైంగిక ఆరోపణలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.