ప్రముఖ ఫిజిక్ బిల్డర్ గా, మాజీ మిస్టర్ ఐడియా మనోజ్ పాటిల్ గురువారం తన ఫ్లాటులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు.ప్రస్తుతం విలే పార్లేలో బిఎమ్సి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్ఎన్ కూపర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇతనికి ఆత్మహత్య చేసుకోవడం కోసం ప్రేరేపించిన పలువురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.అయితే ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నటువంటి మనోజ్ పాటిల్ స్పృహలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కేసు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మనోజ్ ఓషివరాలోని సాయిలీలా అపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్లాట్లో కొన్ని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసుకుపోయారు.అయితే సరైన సమయంలో కుటుంబ సభ్యులు చూసి మనోజ్ ను ఆసుపత్రికి తీసుకు రావడం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే మోడలింగ్ తన కెరీర్ ను ఎంచుకున్న అటువంటి పాటిల్ ఈ విధంగా అర్థాంతరంగా ఆత్మహత్యా యత్నంకి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.ఓషివరా పోలీసులకు ఓ ఫిర్యాదు సమర్పించాడు.
ఈ ఫిర్యాదులో భాగంగా నటుడు సాహిల్ ఖాన్ ,మరికొందరు తన వ్యక్తిగత అభివృద్ధి పై ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తులు తన పరువు తీయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే లేఖ దొరకడంతో పోలీసులు ఆ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు అయితే ప్రస్తుతం పాటిల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉండటం వల్ల వచ్చే ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన తర్వాత అతడి నుంచి వాంగ్మూలం తీసుకుని,ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరపనునట్లు పోలీసులు తెలియజేశారు.ఈ క్రమంలోనే నటుడు సాహిల్ ఖాన్ స్పందిస్తూ మనోజ్ పాటిల్ తనపై పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ.రాజ్ ఫౌస్దార్ అనే వ్యక్తికి పాటిల్ కి మధ్య ఈ వ్యవహారం నడుస్తోందని అసలు విషయం చెప్పడంతో పోలీసులు ఆత్మహత్యకు పురిగొల్పడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం, పరువు నష్టం పై కేసు నమోదు చేసి నటుడు సాహిల్ ఖాన్, మరి కొందరి పై పోలీసులు కేసు నమోదు చేశారు.