బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై దేశంలోని సినీ రంగాలన్నిటి నుండి విమర్శలు వస్తున్నాయి.తాజాగా కంగనా రనౌత్ తానొకప్పుడు డ్రగ్స్ కు బానిసనని సోషల్ మీడియా లో ఓ వీడియోను పోస్ట్ చేశారు దీనిపై శాండల్వుడ్లో ఒకప్పటి హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు.
మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ సోషల్ మీడియా చీఫ్గా వ్యవహరించిన రమ్య గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా రమ్య డ్రగ్స్ బానిసగా మారి ఆతరువాత బయటికి వచ్చానని చెబుతున్న కంగనా తన అనుభవాలను ప్రజలతో పంచుకొని ఈ డ్రగ్స్ సమాజానికి ఏంత కీడును కలిగిస్తాయో చెప్పడం మానేసి నేను ఒకప్పుడు డ్రగ్ అడ్కిట్ అని వీడియోలు పోస్ట్ చేయడమేంటని ఫైర్ అయ్యారు.
అలాగే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే మానసిక ఆరోగ్యంతో బాధపడేవారి కోసం పనిచేస్తున్నారు.
అందుకోసం ఆమె ఏకంగా ఓ సంస్థను దత్తత తీసుకుని ఎంతోమంది పిల్లలకు సహాయం చేస్తున్నారు.ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా అందరి మీదా విమర్శలు గుప్పించడం సరైన పద్ధతి కాదని ఈమె కంగనాకు సూచించారు.