ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్కు ఇటీవలే కాస్త బ్రేకులు పడ్డాయి.ఇప్పటికే వరుస పెట్టి ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు అధికార టీడీపీ గూటికి చేరిపోయారు.
రెండు ఫేజ్ల్లో జరిగిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ కాస్త బ్రేక్ తీసుకుని మూడో ఫేజ్ స్టార్ట్ కానుంది.ఈ క్రమంలోనే సీఎం సొంత జిల్లా చిత్తూరు రాజకీయాల్లో బాగా పట్టున్న ఫ్యామిలీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తిరిగి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది.వారి ఫ్యామిలీ రాజకీయ జీవితం అంతా టీడీపీతోనే ముడిపడి ఉంది.2009 ఎన్నికల్లో సైతం చంద్రబాబు ప్రవీణ్కుమార్రెడ్డికి టిక్కెట్టు ఇవ్వగా ఆయన విజయం సాధించారు.వైకాపా అధికారంలోకి వస్తుందన్న అంచనాతో ప్రవీణ్ 2012లో వైకాపాలోకి జంప్ చేసేశారు.2014 ఎన్నికల్లో ప్రవీణ్ అంచనా వేసినట్టు వైకాపా అధికారంలోకి రాలేదు సరికదా.చిత్తూరు జిల్లాలో వైకాపా మెజార్టీ సీట్లు దక్కించుకున్నా ప్రవీణ్ అనూహ్యంగా ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రవీణ్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను పట్టించుకోవడం మానేశారు.ప్రవీణ్ తీరుతో విసిగిపోయిన జగన్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారడంతో తంబళ్లపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ గా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డిని నియమించారు.
అప్పటి నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎంట్రీతో వైకాపా కేడర్ మొత్తం ఇప్పుడు ఆయన వెంట తిరుగుతోంది.
ఈ క్రమంలోనే ప్రవీణ్కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట.చంద్రబాబు సైతం వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చేసుకోవడంతో ప్రవీణ్ టీడీపీ ఎంట్రీకి పెద్దగా అడ్డంకులు లేవు.
అయితే ప్రవీణ్ ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిలా మారాడు.టీడీపీలో చేరినా అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆయనకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తారా ? లేదా ? అన్నది డౌటే.! ఇక వైకాపాలో ఉన్నా ద్వారకనాథ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చేయడంతో మనోడిని పట్టించుకునే వాళ్లే లేరు.