ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీపీఐ వర్గాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
గుండా మల్లేశ్ కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.హైదరాబాదు నిమ్స్ లో చికిత్స పొందుతూ మంగళవారం నిమ్స్ లో 2.50 నిమిషాలకు కన్నుమూశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గుండా మల్లేశ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అలాగే ఆయన సింగరేణి లో కార్మికుల హక్కుల కోసం నిత్యం పోరాటం చేశారు.కాగా, అభిమానులు, బంధుమిత్రులు ఆయనకు నివాళి అర్పించేందుకు , ఆయన భౌతిక కాయాన్ని ఈరోజు 5 గంటలకు మఖ్దూం భవన్ లో ఉంచనున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఒక ప్రకటన లో వెల్లడించారు.
ఆ తర్వాత, భౌతికకాయాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి తరలించనున్నారు.కాగా, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.
చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకొని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మల్లేశ్ మృతిపట్ల సీపీఐ అగ్రనేతలు డి.రాజా, నారాయణ విచారం వ్యక్తం చేశారు.
.