తుదిశ్వాస విడిచిన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ !

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీపీఐ వర్గాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

 Senior Cpi Leader Gunda Mallesh Dies At 73,gundaa Mallesh, Exmla Gundaa Mallesh,-TeluguStop.com

గుండా మల్లేశ్ కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.హైదరాబాదు నిమ్స్ లో చికిత్స పొందుతూ మంగళవారం నిమ్స్ లో 2.50 నిమిషాలకు కన్నుమూశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గుండా మల్లేశ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అలాగే ఆయన సింగరేణి లో కార్మికుల హక్కుల కోసం నిత్యం పోరాటం చేశారు.కాగా, అభిమానులు, బంధుమిత్రులు ఆయనకు నివాళి అర్పించేందుకు , ఆయన భౌతిక కాయాన్ని ఈరోజు 5 గంటలకు మఖ్దూం భవన్ లో ఉంచనున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఒక ప్రకటన లో వెల్లడించారు.

ఆ తర్వాత, భౌతికకాయాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి తరలించనున్నారు.కాగా, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.

చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకొని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మల్లేశ్ మృతిపట్ల సీపీఐ అగ్రనేతలు డి.రాజా, నారాయణ విచారం వ్యక్తం చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube