తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో రుచి చూపిస్తున్నారు.
అయితే కెసీఆర్ ఈటెల భూ కబ్జాలకు పాల్పడ్డాడని మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇక బీజేపీ లో చెరనున్నట్లు ఈటెల పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో ఇంకా ఈటెల ప్రతి అడుగును రాజకీయ విశ్లేషకులు చాలా సునిషితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాను కలసి వచ్చిన అనంతరం తన స్వంత నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే.ఈ సమయంలో ఈటెల చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి ఉంది.
ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటం జరగబోతున్నదని, కెసీఆర్ పతనం హుజూరాబాద్ నుండే ప్రారంభం అవుతుందని ఈటెల మాటలు ఒక్కసారిగా పెను దూమరాన్నే రేపిన పరిస్థితి ఉంది.ఇక భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నిక కూడా టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చేలా బలమైన వ్యూహరచన చేసే అవకాశం ఉంది.
ఏది ఏమైనా ఈటెల రూపంలో కెసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.