తెలంగాణా క్యాబినెట్ నుంచి వైదొలిగిన మాజీ డెప్యుటీ సీ.ఎం రాజయ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాల్ళోకి వెళితే.తన నియోజకవర్గమైన స్టేషన్ఘన్పూర్ విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని, రాజయ్య హెచ్చరించారు.
తాను భోళాశంకరుడిని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అన్నారు.మంగళవారం నిన్న జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
తన నియోజకవర్గం జోలికి రావొద్దు అని, తన నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని అన్నారు.ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజయ్య తెలిపారు.
మరి ఈ వ్యాఖ్యలు ఎవరిపైన చేసారో.ఎవరిని ఉద్దేశించి చేసారో తెలీదు కానీ.
మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో హాట్ హాట్ గా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి.