నా నియోజకవర్గం జోలికి రావొద్దు!!

తెలంగాణా క్యాబినెట్ నుంచి వైదొలిగిన మాజీ డెప్యుటీ సీ.ఎం రాజయ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Ex Deputy Cm Rajaiah Warning-TeluguStop.com

వివరాల్ళోకి వెళితే.తన నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్ విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని, రాజయ్య హెచ్చరించారు.

తాను భోళాశంకరుడిని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అన్నారు.మంగళవారం నిన్న జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

తన నియోజకవర్గం జోలికి రావొద్దు అని, తన నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని అన్నారు.ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజయ్య తెలిపారు.

మరి ఈ వ్యాఖ్యలు ఎవరిపైన చేసారో.ఎవరిని ఉద్దేశించి చేసారో తెలీదు కానీ.

మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో హాట్ హాట్ గా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube