‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను దక్కించుకున్న నిఖిల్ ప్రస్తుతం ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ‘శంకరాభరణం’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తుండటంతో అందరి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ముఖ్యంగా సినీ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి వ్యక్తం అవుతోంది.ఇక ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమాలోని కీలకమైన అతిథి పాత్రలో బీహార్ మాజీ సీఎం లాూ ప్రసాద్ యాదవ్ను నటింపజేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.కథకు చాలా ముఖ్యమైన పాత్ర అవ్వడంతో ఆయన నటించేందుకు ఓకే చెప్పవచ్చు అని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
బీహార్ నేపథ్యంలో సాగే కామెడీ థ్ల్రిర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నిఖిల్కు జోడీగా నందిత హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాలో లాూ ప్రసాద్ యాదవ్ గెస్ట్రోల్ చేసేందుకు ఓకే చెబితే సినిమాకు భారీ క్రేజ్ వచ్చే అవకాశాలున్నాయి.మరి ఆయన అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.