ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బిజెపి పార్టీ పై వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో… వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎస్ పి కార్యకర్తలు చాలా అలర్ట్ గా ఉండాలని… పోలింగ్ బూత్ లలో కి వచ్చి.బిజెపి పార్టీ నేతలు రిగ్గింగ్.
అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడాలని ఎస్పీ కార్యకర్తలు.
రాబోయే ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని సూచించారు.బిజెపి వేసే ప్రతి వ్యూహాన్ని అప్రజాస్వామిక చర్యలను.
అడ్డుకోవాలని తెలిపారు.గతంలో బీజేపీ పార్టీ రాకముందు యూపీలో జరిగిన అభివృద్ధిని.
తమ అభివృద్ధిగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉందని ధ్వజమెత్తారు.బిజెపి పార్టీ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ప్రజలంతా గట్టిగా బుద్ధి చెప్పాలని.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని.అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ కార్యకర్తలు.
అప్రమత్తంగా ఉండాలని సూచించారు.