ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2009 -2010 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఈ రోజు ఉదయం మరణించారు.కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా రాణించిన ఆయన వైఎస్ మరణించాక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టి.సీఎం గా దాదాపు ఏడాది పాటు కొనసాగారు.అంత మాత్రమే కాక 2011 నుండి 2016 వరకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది.
అనంతరం అనారోగ్యంతో.గత కొంత కాలంగా బాధపడుతూ ఉండటంతో ఈ రోజు ఉదయం.
లో బీపికి గురయ్యి.తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది.
అయితే ఈ క్రమంలో మార్గమధ్యంలోనే ఆయన చనిపోయినట్లు.వైద్యులు నిర్ధారించారు.దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.ఈ పరిణామంతో కొణిజేటి రోశయ్య మరణవార్త తెలుసుకుని.తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు రోశయ్య మరణవార్త తెలుసుకుని.
బాధపడుతున్నారు.గుంటూరు జిల్లా వేమూరు లో జన్మించిన రోశయ్య.88 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది.సీఎంగా అదేరీతిలో రాజ్యాంగ పదవి గవర్నర్ గా ….
ఆరు సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా చేపట్టిన వ్యక్తిగా.పొలిటికల్ కెరియర్ లో చెరగని ముద్ర రోశయ్య వేసుకున్నారు.
రోశయ్య మరణవార్త ఇప్పుడు.తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాక.దక్షిణాది రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.