టీచర్లంటే విద్య నేర్పు మహోన్నత వ్యక్తులు.వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఎందుకంటే ఒక మంచి సమాజం ఏర్పడాలంటే వారితోనే సాధ్యం అవుతుంది.ఇక ఇలాంటి మహోన్నత టీచర్ల గురించి ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం.
కానీ కొన్ని సార్లు కొందరు కీచకులు గురువుల రూపంలో ఉండి చేసే దారుణాలు చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి గురువుల రూపంలో ఉన్న దారుణ మనుషుల గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక విషయానికి వస్తే ఏపీలోని గుంటూరు జిల్లాలో టీచర్ దంపతులపై దాడి కేసు ఎంత సంచలనరేపిందో అందరికీ తెలిసిందే.
అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే దీని చిక్కుముడి విప్పిన పోలీసులకు ఎన్నో వింత అనుభవాలు ఎదురయ్యాయి.
ఎందుకంటే వీరితో పనిచేసే సహ ఉపాధ్యాయురాలే తన భర్తతో కలిసి ఈ టీచర్ దంపతులపై దాడి చేయించినట్లు సంచలన విషయాలు బయటకు వచ్చాయి.పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు లో ఉండే హైస్కూల్ లో పనిచేస్తున్న దీపాల కృష్ణ ప్రసాద్, అలాగే హెచ్ ఎం అయిన ఆయన భార్య రాధిక దంపతులపై రీసెంట్ గా కొందరు రౌడీలు నడిరోడ్డుపై దారుణంగాదాడి చేసి 5 తులాల వరకు వారి దగ్గరి నుంచి బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
కాగా దీన్ఇన సీరియస్గా తీసుకున్న పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయాలను తెలుసుకున్నారు.ఇక దాడి చేసిన నిందితులను అదుపులోకి విచారించగా అలసువ విషయాలు బయటకు వచ్చాయి.
ఇందులో ట్విస్టు ఏంటంటే వాడపల్లి హైస్కూల్కు చెందిన టీచర్ తన హెచ్ ఎం అయిన రాధికపై కోపంతోనే దాడి చేయించినట్లు ఇక్కడ సమాచారం.ఇక ఈ దాడి కోసం ఏకంగా తన భర్త ప్రమేయంతో ఈ విధంగా దారుణానికి ఒడిగట్టింది.
తనను నిత్యం రూల్స్ పాటించాలని ఆర్డర్ వేస్తుంటే తట్టుకోలేకనే ఇలా చేసిందంట.దీంతో ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.