ఉరిశిక్ష అమలుకు అంతా సిద్ధం చేస్తున్న అధికారులు

2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ ఘటనలో నిందితులకు ఇప్పటివరకు శిక్షలు అమలు చేయలేదు.

 Everything Getting Ready For Nirbhayavictims-TeluguStop.com

ఇటీవల ఈ కేసు ను విచారించిన ఢిల్లీ పటియాలా కోర్టు ముద్దాయిలు నలుగురికి ఉరిశిక్ష లు ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.అయితే మెర్సీ పిటీషన్ కు అనుమతి ఇవ్వడం తో నిందితుల్లో ఒకరు రాష్ట్రపతి కి క్షమాభిక్ష పిటీషన్ ను దాఖలు చేసుకున్నారు.

దీనితో ఈ రోజు అనగా 22 న వారికి ఉరిశిక్ష అమలు జరపాల్సి ఉండగా,మెర్సీ పిటీషన్ కారణంగా కొంత జాప్యం జరిగింది.అయితే రాష్ట్రపతి వారి పిటీషన్ ను తిరస్కరించడం తో వారి ఉరి శిక్షను పోస్ట్ పొన్ చేసి ఫిబ్రవరి 1 న వారి ఉరిశిక్షలు అమలు చేయాలి అని నిర్ణయించారు.

ఈ క్రమంలో వారిని ఉరితీయడానికి తీహార్ జైలు అధికారులు మాక్ ఉరిశిక్షలను కూడా అమలు పరిచారు.అయితే వారిని ఉరితీయడానికి తలారి పవన్ జల్లాద్ కూడా నియమితులయ్యారు.

దీనితో ఫిబ్రవరి 1 న నిర్భయ కేసులో దోషులు అయిన పవన్ గుప్తా,అక్షయ్ ఠాకూర్,ముఖేష్ సింగ్,వినయ్ శర్మ ల ఉరి శిక్ష అమలు చేయనున్నారు.ఈ క్రమంలో తలారి పవన్ జల్లాద్ ఈ నెల 30 వ తేదీన అక్కడకి చేరుకుంటారని అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఆ నలుగురు నిందితులను ఉరి తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube