నాలుగేళ్ళ ముందు వరుకు 3జి ఉండడమే గొప్ప.అలాంటిది జియో 4 జి తీసుకొచ్చి అందరికి సేవ చేసింది.
దీంతో స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేకుండా పోయాడు.ఇంకా అంత డిజిటల్ ఇండియాగా మారుతూ వస్తుంది.
అయితే ఇప్పుడు పరుగులు తీసే మనిషికి ఈ వేగం సరిపోలేదు.అందుకే 5జి ని తీసుకువస్తున్నారు.
భారతదేశంలో ఇప్పుడు ఉన్న బ్రాడ్బ్యాండ్, 4జీ సెల్యులర్ నెట్వర్కులు అన్ని కూడా వేగవంత అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయ్.
అయితే ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జి సిగ్నెల్ అందుబాటులోకి వచ్చింది.
టిబెట్ – చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నెల్ అందుబాటులో ఉంటుందని చైనా ఈ సందర్భంగా ప్రకటించింది.ప్రస్తుతం 5800 మీటర్ల వరకు బేస్ క్యాంప్ లు ఉండగా.6500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్ స్టేషన్లో పనులు ప్రారంభం కావడంతో హిమాలయ పర్వతాలపై కూడా ఇప్పుడు 5జి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది.