వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది.దీని ఫలితంగా ఈ రోజు మనం నూతన ఆవిష్కరణలను చేయడంతోపాటు, ముఖ్యమైన పరిశోధనలు చేయగలుగుతున్నాం.
చాలా సంవత్సరాల క్రితం దాదాపు అసాధ్యం అనిపించిన కొన్ని ఇప్పడు సుసాధ్యం అవుతున్నాయి.మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వైద్యులు అద్భుతం చేశారు.
ఈ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల బ్రెయిన్ డెడ్ అయిన మహిళ చేతులను ముంబైకి చెందిన టీనేజ్ అమ్మాయికి మార్పిడి కోసం దానం చేశారు.ఇలాంటి కేసు ఇదే మొదటిదని, అవయవదాన రంగంలో ఇది విప్లవం తీసుకురాగలదని ఆరోగ్య అధికారి తెలిపారు.
ఆ మహిళ చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారని తెలిపారు.ఇండోర్కు చెందిన వినీతా ఖాజాంచి తీవ్రమైన మెదడు వ్యాధితో జనవరి 13 ఉదయం ఇండోర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
రెండు రోజుల తరువాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.
చేతుల దానం ఇదే తొలిసారి.ఇందూరు సొసైటీ ఫర్ ఆర్గాన్ డొనేషన్ సెక్రటరీ డాక్టర్ సంజయ్ దీక్షిత్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి చెందిన రెండు చేతులు దానం చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని, అవయవదానం రంగంలో ఇదో విప్లవం లాంటిదని అన్నారు.ఖాజాంచి చేతులను ప్రత్యేక విమానంలో సోమవారం ముంబయికి పంపినట్లు రాష్ట్ర మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ దీక్షిత్ తెలిపారు.18 ఏళ్ల యువతి పుట్టుక సమయంలో అవయవాలు లేకుండా పుట్టిందని ఆయన చెప్పారు.ఇప్పుడు ప్రయివేటు ఆసుపత్రిలో మార్పిడి ద్వారా ఆమెకు చేతులను అతికించనున్నారు.
ఖాజాంచికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఆమె భర్త సునీల్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు.ఆమె పెద్ద కుమార్తె నిరీహా మాట్లాడుతూ.
‘‘అమ్మాయిలంటే మా అమ్మ మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది.ఆమె మరణం తర్వాత ఆమె రెండు చేతులు 18 ఏళ్ల యువతికి మార్పిడి చేయడం యాదృచ్ఛికం.
అవయవ దానాన్ని ప్రోత్సహించండిఖాజాంచి ఊపిరితిత్తులను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించి ఇద్దరు నిరుపేద రోగులకు అమరుస్తామని, ఆమె కాలేయం, రెండు కిడ్నీలు ఇండోర్లోని గ్రహీతలకు వెళ్తాయని, అవయవ దాన్నాన్ని ప్రోత్సహించే ఎన్జీవో ముస్కాన్ గ్రూప్లో వాలంటీర్ అయిన సందీపన్ ఆర్య తెలిపారు.ఖాజాంచి చర్మాన్ని, కళ్లను ఆర్గాన్ బ్యాంకుల్లో భద్రపరిచామని చెప్పారు.