టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.మద్యం మత్తు తలకెక్కిన నేపథ్యంలో ఓ వివాహిత చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు యత్నించిన ఘటనలో రావెల సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేశ్ పై బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి కాస్త ఆలస్యంగా స్పందించిన పోలీసులు నేటి ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లోని రావెల ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.