మన బుల్లితెర ప్రేక్షకులను తారక్ తన హోస్టింగ్ తో అలరిస్తున్నాడు.జెమినీ టీవిలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇంట్రెస్టింగ్ గెస్టులతో ఇప్పటి వరకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఆకట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది.ఇక ఈ షో ముగింపుకి చేరింది.
నిన్న ఆదివారం ఈ షో లాస్ట్ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది.
ఈ షో లాస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు.ఈ ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ షో లాస్ట్ ఎపిసోడ్ తో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కు అద్బుతమైన ఎండింగ్ ఇచ్చేసాడు.
ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ కు విచ్చేసిన మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చుని గేమ్ ఆడి 25 లక్షలు గెలుచుకున్నాడు.
ఇక నిన్న ప్రసారం అయినా ఈ ఎపిసోడ్ ను చూడడానికి ప్రేక్షకులకు రెండు కళ్ళు చాలలేదు.
వీరిద్దరు కలిసి వేదికపై కనిపించడం మొదటిసారి కావడంతో ఈ ఎపిసోడ్ కన్నుల విందుగా అనిపించింది.ఎప్పటి నుండో ఈ ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ పెంచుతూ వచ్చిన మేకర్స్ ఈ ఎపిసోడ్ ను ప్రేక్షకులు ఏమాత్రం అప్సెట్ అవ్వకుండా మొత్తగా అలరించే విధంగా ఉండడంతో ఈ ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా నచ్చింది.
ఎన్టీఆర్ తన వాక్ చాతుర్యంతో మహేష్ బాబు నుండి చాలా విషయాలను రాబట్టాడు.ఈ ఎపిసోడ్ ను ఎన్టీఆర్ మంచి ఇంట్రెడక్షన్ తో స్టార్ట్ చేయడమే కాకుండా ముగించడం కూడా అంతే హుషారుగా ముగించేశాడు.ఈ షోలో పాల్గొన్న మహేష్ బాబు సెట్ అంత బాగుందని కూడా కామెంట్ చేసారు.ఇక వీరిద్దరి మధ్య ఆద్యంతం సాగిన సంభాషణ ప్రేక్షకులను అలరించింది.మహేష్, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి సంభాషణ సాగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ ను చూడాల్సిందే.