తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తారక్ తన హోస్టింగ్ తో అలరిస్తున్నాడు.జెమినీ టివిలో ప్రసారం అవుతున్న ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ షోకు ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తూ తన యాంకరింగ్ తో ఈ షో ను టాప్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.సెలెబ్రిటీ గెస్టులతో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది.
తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సూపర్ స్టార్ మహేష్ బాబును గెస్ట్ గా ఆహ్వానించాడు ఎన్టీఆర్.ఈ విషయాన్నీ ఎప్పుడు జెమిని టీవీ తెలిపింది.కమింగ్ సూన్ అంటూ జెమిని వారు ఈ ఎపిసోడ్ పై క్యూరియాసిటీ పెంచుతున్నారు.ఇక ఈ ఎపిసోడ్ కోసం అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరి అలంటి ఎపిసోడ్ గురించి లేటెస్ట్ గా జెమిని టీవీ ఒక ప్రోమో విడుదల చేసింది.
మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒకే వేదికపై అలరించ బోతున్నారు.ఈ ప్రోమో మొత్తం ఫన్నీగా ఉంది.ఇక ఈ ప్రోమోలో అటు మహేష్ బాబు ఇటు ఎన్టీఆర్ ఎవ్వరు కూడా తగ్గకుండా పంచ్ లు వేశారు.
ఈ షోలో మహేష్ ను ప్రశ్నలు అడిగిన సందర్భంలో మహేష్ ఎన్టీఆర్ ను.అటు తిప్పి ఇటు తిప్పి ఎందుకు అడుగుతున్నారు.అని మహేష్ అడగగా.సరదాగా అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు ఎన్టీఆర్.
ఇక తారక్ అలా చెప్పడంతో మహేష్ మీ కన్నా కూడా మీ గురువుగారే బెటర్ అంటూ మహేష్ కూడా కౌంటర్ వేసాడు.ఇక ఈ ప్రోమో చూసిన అభిమానులు ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు కూడా ఈ షో ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలపలేదు.కమింగ్ సూన్ అంటూ ఈ ప్రోమోను విడుదల చేసింది.ఇక ఫుల్ ఎపిసోడ్ లో వీళ్ళ అల్లరి చూడడానికి ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.