బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కామెడీ షో గతకొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ వస్తోంది.
అయితే ఈ షోకు ప్రేక్షకాదరణ కూడా భారీగా ఉండటంతో ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వస్తూ ఉన్నాయి.కాగా తాజాగా వెలువడిన టీఆర్పీ రేటింగ్స్లో జబర్దస్త్ షోను అధిగమించి న్యూస్ క్రియేట్ చేసింది మరో కార్యక్రమం.
ఇంతకీ జబర్దస్త్ను ఓవర్టేక్ చేసిన ఆ కార్యక్రమం ఏమిటని అనుకుంటున్నారు.ఈటీవీలో రోజు ఉదయం 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్ను ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీక్షిస్తుంటారు.
అనవసరమైన వార్తలను ఈ బులెటిన్లో పదేపదే చెప్పడం లాంటివి ఉండకపోవడంతో, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈటీవీ న్యూస్ను చూస్తుంటారు.ఇప్పుడు ఇదే ఈ కార్యక్రమానికి ప్లస్ పాయింట్ అయ్యింది.
తాజాగా వెలువడని టీఆర్పీ రేటింగ్స్లో జబర్దస్త్ కామెడీ షోను అధిగమించి ఎక్కువ వ్యూవర్షిప్ తెచ్చుకుంది ఈటీవీ న్యూస్.దీంతో ఈ ప్రోగ్రామ్కు అదిరిపోయే టీఆర్పీ వచ్చినట్లు తెలుస్తోంది.
కాస్త విడ్డూరంగా ఉన్న ఈ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత రావడంతో ఈటీవీ న్యూస్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.ఇక జబర్దస్త్ కామెడీ షో టీఆర్పీ తగ్గడంతో షో నిర్వాహకులు మరింత ఎంటర్టైన్మెంట్ను అందించేందుకు రెడీ అయ్యారు.