జబర్దస్త్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే వారు సుధీర్ మరియు రష్మి.వీరిద్దరు ఏ రేంజ్ లో సక్సెస్ ను దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకరి వల్ల మరొకరికి పేరు వచ్చింది.ఇద్దరు కూడా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు.టాలీవుడ్ వర్గాల్లో కూడా వీరికి మంచి పేరు ఉంది.సుధీర్ మరియు రష్మీ తర్వాత చాలా మంది కూడా సోషల్ మీడియాలో పేరు దక్కించుకున్నారు.
కాని ఏ ఒక్కరు కూడా పెద్దగా పేరును దక్కించుకున్న దాఖలాలు లేవు.ఈ మద్య కాలంలో జబర్దస్త్ స్టేజ్ పై ఇమాన్యూల్ మరియు వర్ష ల రొమాన్స్ మామూలుగా లేదు.
వీరిద్దరు కూడా స్టేజ్ పై తెగ రొమాన్స్ కుమ్మరిస్తున్నారు.వీరిద్దరి జోడీ పై తెగ మీమ్స్ మరియు సోషల్ మీడియా పోస్ట్ లు వస్తున్నాయి.
ఈ సమయంలోనే వీరిద్దరు మరో అడుగు ముందుకు వేశాం అన్నట్లుగా ఇమాన్యూల్ మరియు వర్ష లు తాజా స్టేజ్ పై మరోసారి రచ్చ చేశారు.
వచ్చే వారం ఎపిసోడ్ లో వీరిద్దరి మద్య ఆసక్తికర సంఘటన జరిగింది.
స్కిట్ అంతా పూర్తి అయిన తర్వాత వర్ష మాట్లాడుతూ ఒక రోజు మద్యరాత్రి సమయంలో ఇమాన్యూల్ ఫోన్ చేసి ఎలా ఉన్నావు అన్నాడు.అసలు విషయం ఏంటీ అంటే ఎవరో యూట్యూబ్ లో నా గురించి తప్పుగా రాశారు.
అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫోన్ చేశారు.వర్ష మరియు ఇమాన్యూల్ ల మద్య ఉన్న కెమిస్ట్రీ మరీ ఎక్కువ అయ్యింది అంటూ రోజా కూడా చెప్పుకొచ్చింది.
వర్ష మరియు ఇమాన్యూల్ ల మద్య ప్రేమ మరింత ముదురుతుందని కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరి వ్యవహారం చూస్తుంటే మరింత ముందుకు వెళ్తారేమో అనిపిస్తుంది.