తెలంగాణలో ఎంతో ఉత్కంఠకు తెర లేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇక ఈ ఉప ఎన్నిక జరిగిన కాలంలో టీఆర్ఎస్ నుండి మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఉంటూ పెద్ద ఎత్తున చక్రం తిప్పిన విషయం తెలిసిందే.
అయితే ఇటు హరీష్ రావు వ్యూహాలు కొంత మేర పనిచేసినా టీఆర్ఎస్ ను మాత్రం విజయ పధంలో నడిపించుకోలేక పోయాయి.అయితే ఇక ఎట్టటెలకు ఈటెల రాజేందర్ గెలిచిన తరువాత ఇక తనదైన శైలిలో దూసుకపోతున్నారు ఈటెల రాజేందర్.
ఇక ఉప ఎన్నికలో తనను టార్గెట్ చేసి తనను ఓడించడానికి ప్రయత్నించిన హరీష్ రావును ఈటెల రాజేందర్ టార్గెట్ చేశారు.సిద్దిపేటలో పర్యటిస్తూ అక్కడ బీజేపీ గెలుపొందడానికి ఉన్న అవకాశాలను మరింత మెరుగుపరుస్తున్న పరిస్థితి ఉంది.
అయితే చాలా వరకు బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలే టార్గెట్ గా అక్కడ బీజేపీ పాగా వేయడమే లక్ష్యంగా దూసుకపోతున్న పరిస్థితి ఉంది.
సిద్దిపేటలో హరీష్ రావును ఢీ కొట్టే నాయకుడు లేరు ఇప్పటి వరకు.ఎన్నిక ఎన్నికకు హరీష్ రావు మెజారిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు తప్ప తగ్గడం లేదు.ఇటువంటి సమయంలో ఈటెల రాజేందర్ హరీష్ రావును దెబ్బ తీయడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయా అంటే అంత సులభమైన విషయం కాదు.
అంతేకాక హరీష్ రావుకు చందాలు వేసుకొని ఎన్నికల ప్రచారానికి డబ్బులు ఇస్తున్న చరిత్ర సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఉంది.ఏది ఏమైనా ఈటెల వేస్తున్న ఈ అడుగులు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి.
ఇక టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య రానున్న రోజుల్లో భీకర పోరు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.