హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి బీజేపీ పార్టీ నాయకుడు ప్రజా జీవన యాత్ర పేరిట పాదయాత్ర స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం బత్తిని వానిపల్లి నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో బిజెపి పార్టీ కీలక నాయకులు కార్యకర్తలు మరియు అనుచరులు ఈటల బాటలో పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో పాదయాత్ర ప్రారంభంలోనే టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పై రాంచరణ్ డైలాగ్ లు వేశారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రౌడీయిజం.
గుండాగిరి చేస్తోంది అంటూ నిప్పులు చెరిగారు.పాదయాత్రకి అనుమతులు ఉన్నా కానీ ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారన ఆరోపించారు.
పాదయాత్రలో భాగంగా మధ్యాహ్న భోజన విరామం కోసంర్టీ నేతలు అందరూ బుక్ చేసుకున్న రైసు మిల్లును ఇటీవల సీజ్ చేయడం దారుణమని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది అందువల్ల ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని కెసిఆర్ నైజానికి ఇది నిదర్శనమని తెలిపారు.
కెసిఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం ఈ పాదయాత్ర ద్వారా తెలియజేస్తామని అని అహంకార పాలనకు గట్టిగా బుద్ధి చెబుతామని ఈటల పాదయాత్ర ప్రారంభంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.