మంత్రి ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్..!!

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల హుజూరాబాద్ పరిధిలోని వీణవంక మండలంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికల ప్రారంభ కార్యక్రమంలో రైతులతో భేటీ అయిన సమయంలో షాకింగ్ కామెంట్లు చేశారు.రాజకీయాలలో కులం, డబ్బు అదేవిధంగా పార్టీ జెండా కాదు.

 Etela Rajender Shocking Comments Etela Rajender, Mahabaratham, Telangana,huzurab-TeluguStop.com

మనిషిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.అదేవిధంగా ధర్మం, న్యాయం అనేవి ఒక సారి ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోవు అని పేర్కొన్నారు.

తాను గాయపడిన తన మనసు మార్చుకో లేదని, 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు అంటూ ఈటెల రాజేందర్ భావోద్వేగపరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను బతికినంతకాలం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా అని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో చేసింది ఏంటో ప్రజలకు తెలుసు, తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చేసింది గుండెల్లో ఉంటుందని మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది అలాగే రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు రావణుడు ఉన్నాడు అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు.

అందరూ ఒకే విధంగా ఉండరు.సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు.నాయకులంటే భారీ  ఆకారం, అభరణాలు, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి  అంటూ ఈటల షాకింగ్ కామెంట్ చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube