తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల హుజూరాబాద్ పరిధిలోని వీణవంక మండలంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికల ప్రారంభ కార్యక్రమంలో రైతులతో భేటీ అయిన సమయంలో షాకింగ్ కామెంట్లు చేశారు.రాజకీయాలలో కులం, డబ్బు అదేవిధంగా పార్టీ జెండా కాదు.
మనిషిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.అదేవిధంగా ధర్మం, న్యాయం అనేవి ఒక సారి ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోవు అని పేర్కొన్నారు.
తాను గాయపడిన తన మనసు మార్చుకో లేదని, 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు అంటూ ఈటెల రాజేందర్ భావోద్వేగపరమైన వ్యాఖ్యలు చేశారు.
తాను బతికినంతకాలం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా అని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో చేసింది ఏంటో ప్రజలకు తెలుసు, తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చేసింది గుండెల్లో ఉంటుందని మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది అలాగే రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు రావణుడు ఉన్నాడు అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు.
అందరూ ఒకే విధంగా ఉండరు.సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు.నాయకులంటే భారీ ఆకారం, అభరణాలు, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి అంటూ ఈటల షాకింగ్ కామెంట్ చేశారు.
.