ఆకలితో ఉన్న నక్కకు ఆహారం దొరికితే ఎలా ఉంటుందో ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయ పరిస్దితులు కూడా అలాగే ఉన్నాయంటున్నారట విశ్లేషకులు.దీనికి కారణం వైఎస్ షర్మిళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ స్దాపించాలనే నిర్ణయమేనట.ఇక వైఎస్ షర్మిల పార్టీ పెడతారని వార్తలు రాగానే రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి అంటున్నారు కొందరు నేతలు.ఇప్పటికే షర్మిల పార్టీ విషయంలో గులాభి నేతలు తలో విమర్శ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా స్పందించారు.
కాగా మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయని, మనిషి గురించి ఆలోచించేవారికే ప్రజల మద్దతు ఉంటుందని మంత్రి ఈటల పేర్కొన్నారు.
అలాగే ప్రజల బాగుకోసం ఆలోచించక పదవుల కోసం ప్రాకులాడే వారి విషయంలో సెంటిమెంట్స్ ఎక్కువకాలం పనిచేయవని స్పష్టం చేశారు.
ఇకపోతే మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాలవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక ప్రభుత్వం అంటే మార్వాడి కొట్టు కాదంటూ ఈటల వ్యాఖ్యానించారు.