హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతలా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నదో మనం చూస్తున్నాం.అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చాడో అప్పటి నుండే నియోజకవర్గంలో ఆత్మగౌరవ నినాదంతో ఇంటింటికి పాదయాత్ర చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే మొన్నటి వరకు మిగతా రాష్ట్రాల ఉప ఎన్నిక స్థానాలతో పాటే నోటిఫికేషన్ వస్తుందని బీజేపీ ఆశించినా హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో కొంత నిరాశ చెందిన మాట వాస్తవం.అయితే ఒకప్పటి లాగా హుజురాబాద్ లో ఈటెల ప్రచారం జోరుగా కొనసాగడం లేదు.
అందుకు గల ప్రధాన కారణమేంటని మనం ఒకసారి విశ్లేషిస్తే ఇప్పట్లో ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఖాళీ సమయాన్ని బలమైన వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు వినియోగించుకుంటున్నారు.అంతేకాక టీఆర్ఎస్ ఎత్తులను గమనిస్తూ వాటికి పై ఎత్తులు వేసేలా బలమైన వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈటెల తప్పక గెలుస్తారని బీజేపీ బలమైన నమ్మకం ఉన్నా అధికారంలో ఉన్న పార్టీతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దనేది బీజేపీ ఆలోచన.అందుకే ప్రచారం మీదే కాకుండా వ్యూహప్రతి వ్యూహాలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు ఈటెల.