మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజరాబాద్ ఉప ఎన్నికలలో పార్టీ తరఫున పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే.ఈ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఖచ్చితంగా కెసిఆర్ పై గెలవాలన్న ఉద్దేశంతో ఈటల రాజేందర్.పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది.
ప్రజా దీవెన పేరిట జరుగుతున్న ఈ పాదయాత్రలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీని గెలిపించే విధంగా అడుగులు వేస్తూ వస్తున్నారు.పాదయాత్రలో ఉన్న టైంలో అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన ఆయన తాజాగా కోలుకొని మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం జరిగింది అని మండిపడ్డారు.తెలంగాణ ప్రజల రక్తాన్ని కళ్ల చూసిన వారికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈటల పేర్కొన్నారు.రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజల మన్నలను పొందు కోవటానికి కష్టించి శ్రమిస్తారు.లేదా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేస్తారు.కాని కేసీఆర్ మాత్రం డబ్బులు నమ్ముకుని రాజకీయాలు… చేస్తున్నారని అన్నారు.ఇప్పటికే నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఖర్చు చేసినట్లు హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలవడానికి కేసీఆర్ పైసలు నమ్ముకున్నారు అంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు.
ఇటువంటి కుట్రలు కుతంత్రాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.