తెలంగాణ రాజకీయాలలో ఈటెల రాజేందర్ భూ వ్యవహారం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.అయితే తమ భూములను కబ్జా చేసాడని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు లేఖ రాయడంతో స్పందించిన కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
అయితే ఈ విచారణలో ప్రాథమికంగా ఈటెల భూములు కబ్జా చేసాడని అధికారులు నిర్ధారించారు.అయితే ఈ విషయంపై మొదటి రోజు చాలా ఆచితూచి స్పందించిన ఈటెల.
ఇప్పుడు ఈటెల తన స్వరాన్ని మార్చారు.ఈ సందర్భంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసాడు.
కేసీఆర్ కేబినెట్ లో మంత్రులకు స్వేచ్చ లేదని, మంత్రుల శాఖలపై సమీక్షలో మంత్రులు లేకుండానే కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని ఇక మంత్రులుగా కొనసాగడం ఎందుకని ప్రతి ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని, కాని బయటకి చెప్పారని అన్నారు.ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ఉద్యమ కాలం నాటి కేసీఆర్ కాదని, బంధాలను, ఉద్యమకారులను మర్చిపోయారని అన్నారు.
ఉద్యమ ప్రస్థానాన్ని మర్చిపోయారని ఇక కేసీఆర్ పతనం ఖాయమని తెలిపారు.మరి ఈటెల కొత్త పార్టీ పెట్టబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మరి ఈటెల ఈ ప్రచారం పై ఇంకా స్పందించకపోయినా భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.