ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ ల ట్విస్ట్ లతో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది.తెలంగాణలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎటువంటి వివాదం లేని రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది.
అయితే ఇప్పుడు కేసీఆర్ భర్తరఫ్ అనంతరం ఈటెల పూర్తిగా ఇప్పుడు టీఆర్ఎస్ తో ఒక సభ్యత్వం ఉన్న వ్యక్తిగా మాత్రమే ఉన్న ఈటెల, టీఆర్ఎస్ లో జరిగే ఏ కార్యక్రమాలకు హాజరవకుండా దూరంగా ఉంటున్నాడు.ఈటెల ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో భేటీ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈటెలను కాంగ్రెస్ లో చేరికపై ఆ భేటీ సమయంలో చర్చలు జరిగినట్టు సమాచారం.
అంతేకాక బీజేపీ కూడా ఈటెలను తమ వైపు తిప్పుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఈటెలను ఇంతగా అన్ని పార్టీలు కాకా పట్టడానికి ప్రధాన కారణం ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఈటెలను ఎరగా వేసి ఓట్లు దండుకుందామనే వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ వల్ల అన్యాయానికి గురైన వ్యక్తులను ఎరగా చూపాలన్నది ప్రతిపక్షాల ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగంగా ఈ విషయాన్ని పొందుపర్చుకుంటున్నారు.
అందుకే ఈటెల విషయంలో ఇటు బీజేపీ కాని కాంగ్రెస్ కాని అంతలా పట్టుబట్టడానికి గల కారణంగా తెలుస్తోంది.