మాజీ మంత్రి ఈటెల వ్యవహారం ఎటువైపు దారితీస్తుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే మంత్రి గంగులను రంగంలోకి దింపిన కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.
ఈటెల వైపు ఎవరూ వెళ్లకుండా భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి గంగుల భరోసా నిస్తున్నారు.ఒక వైపు క్యాడర్ చేజారిపోకుండా మంత్రి గంగుల వ్యూహాలు రచిస్తుండగా, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులతో త్వరలో కేటీఆర్ కూడా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాక ఈటెలకు గట్టి పోటీనిచ్చేలా కెప్టెన్ లక్ష్మీ కాంతారావు అన్న కొడుకు భరత్ రెడ్డిని త్వరలో బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది.ఇటు క్యాడర్ ను ఈటెలకు దూరం చేస్తూ, ఈటెల ముఖ్య అనుచరులను ఈటెల వైపు వెళ్లకుండా అడ్డుకుంటూ, రాజకీయంగా బలహీనపరుస్తూ భరత్ రెడ్డిని రంగలోకి దింపుతూ ఈటెల విషయంలో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది.
దీంతో ఇప్పటివరకు కరోనా సమయంలో రాజకీయాలు తగదని లైట్ తీసుకున్న ఈటెల హుజురాబాద్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈటెల గుండెల్లో గుబులు పుట్టిందని ఈటెల ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు.మరి ఈటెల- టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ వ్యవహారంలో ఎవరిది అంతిమ విజయం అనేది తెలియాలంటే మరోకొన్ని రోజులు ఆగాల్సిందే.