మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరికపై బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో పొంగులేటి, జూపల్లి చేరిక కష్టమేనని ఈటల రాజేందర్ చెప్పారని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు.వారి ఇద్దరూ తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారన్న ఈటల ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగా అని చెప్పారు.
ప్రియాంక గాంధీ కలుస్తున్నారనే సమాచారంతోనే అప్పటిలో పొంగులేటి నివాసానికి వెళ్లామని తెలిపారని సమాచారం.ఈ నేపథ్యంలోనే వారు ఇద్దరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
అయితే పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరతారనే విషయంపై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.